ఏపీ కరోనా బులిటెన్.. మళ్లీ పెరిగిన మరణాలు
1367 New Corona Cases Reported In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా
By Medi Samrat Published on
16 Sep 2021 10:52 AM GMT

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,178 పరీక్షలు నిర్వహించగా.. 1,367 కేసులు నిర్ధారణ అయినట్లు గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,34,786కి చేరింది. నిన్న కరోనా వల్ల 14 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,044కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,243 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,06,034కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,708 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,75,36,639 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Next Story