ఏపీలో కరోనా కలకలం.. కలవర పెడుతున్న కేసులు, మరణాలు

13,474 New corona cases reported in AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య మళ్లీ 13 వేలకుపైగా నమోదైంది.

By అంజి  Published on  27 Jan 2022 1:18 PM GMT
ఏపీలో కరోనా కలకలం.. కలవర పెడుతున్న కేసులు, మరణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య మళ్లీ 13 వేలకుపైగా నమోదైంది. కేసులు పెర‌గుతుండటంతో మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,771 పరీక్షలు నిర్వహించగా.. 13,474 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,36,047కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న తొమ్మిది మంది మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఇద్ద‌రు, నెల్లూరు, చిత్తూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాల‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,579గా ఉంది. 24 గంటల వ్యవధిలో 10,290 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 21,11,975కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,09,493 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,23,25,140 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story