ఏపీ కరోనా బులిటెన్.. తగ్గిన కేసులు, టెన్షన్ పెడుతున్న మరణాలు
13400 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 84,232
By Medi Samrat Published on 30 May 2021 11:34 AM GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 84,232 శాంపిళ్లను పరీక్షించగా.. 13,400 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 16,85,142కి చేరింది. నిన్న 21,133 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 15,08,515కి పెరిగింది.
#COVIDUpdates: 30/05/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) May 30, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,82,247 పాజిటివ్ కేసు లకు గాను
*15,05,620 మంది డిశ్చార్జ్ కాగా
*10,832 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,65,795#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/chYII3gQic
కోవిడ్ వల్ల చిత్తూర్ లో పద్నాలుగు మంది, ప్రకాశం లో తొమ్మిది, పశ్చిమ గోదావరి లో తొమ్మిది, అనంతపూర్ లో ఎనిమిది, తూర్పు గోదావరి లో ఎనిమిది, శ్రీకాకుళం లో ఎనిమిది, విశాఖపట్నం లో ఎనిమిది, కృష్ణ లో ఆరుగురు, విజయనగరం లో ఆరుగురు, కర్నూల్ లో ఐదుగురు, నెల్లూరు లో ఐదుగురు, గుంటూరు లో నలుగురు, వైఎస్ఆర్ కడపలో నలుగురు చొప్పున మొత్తం 94 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,832కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,65,795 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 1,91,72,843 సాంపిల్స్ ని పరీక్షించారు.