ఏపీలో కరోనా విలయతాండవం.. భారీగా పెరిగిన కేసులు

12,615 New corona cases reported in AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజు క‌రోనా కేసులు సంఖ్య

By అంజి  Published on  20 Jan 2022 11:44 AM GMT
ఏపీలో కరోనా విలయతాండవం.. భారీగా పెరిగిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజు క‌రోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. నిన్న‌టితో పోల్చితే కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 47,420 పరీక్షలు నిర్వహించగా.. 12,615 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,14,0056కి చేరింది. క‌రోనా వ‌ల్ల ఐదుగురు మంది మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,527గా ఉంది. 24 గంటల వ్యవధిలో 3,674 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,71,658కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,871 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,20,12,102 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story