ఏపీ కరోనా బులిటెన్.. మళ్లీ పెరిగిన మరణాలు
1217 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,678 పరీక్షలు నిర్వహించగా.. 1,217
By Medi Samrat Published on 21 Aug 2021 10:33 AM GMT
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,678 పరీక్షలు నిర్వహించగా.. 1,217 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,01,255 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల పదమూడు మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,715కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,535 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,72,399కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,141 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,60,34,217 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
#COVIDUpdates: 21/08/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 21, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,98,360 పాజిటివ్ కేసు లకు గాను
*19,69,504 మంది డిశ్చార్జ్ కాగా
*13,715 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15,141#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/mFBFWZuske