ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా మ‌ర‌ణాలు

1184 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా

By Medi Samrat  Published on  26 Sep 2021 2:28 PM GMT
ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 58,545 పరీక్షలు నిర్వహించగా.. 1,184 కేసులు నిర్ధారణ అయిన‌ట్లు ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,46,841కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ప‌ద‌కొండు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,136కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,333 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,19,657కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,048 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,80,94,644 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.





Next Story