ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా 11,573 కేసులు, మూడు మ‌ర‌ణాలు

11573 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు

By Medi Samrat  Published on  29 Jan 2022 11:45 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా 11,573 కేసులు, మూడు మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య మళ్లీ 11 వేలకుపైగా నమోదయ్యాయి. కేసులు పెర‌గుతుండటంతో మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40,357 పరీక్షలు నిర్వహించగా.. 11,573 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,60,181కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న ముగ్గురు మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,594గా ఉంది. 24 గంటల వ్యవధిలో 9,445 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 21,30,162కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,15,425 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,24,06,132 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story