ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..
1085 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 57,745 పరీక్షలు నిర్వహించగా..
By Medi Samrat Published on 22 Aug 2021 12:21 PM GMT
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 57,745 పరీక్షలు నిర్వహించగా.. 1085 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,02,340 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల ఎనిమిది మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,723కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,541 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,73,940కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,677 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,60,91,962 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
#COVIDUpdates: 22/08/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 22, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,99,445 పాజిటివ్ కేసు లకు గాను
*19,71,045 మంది డిశ్చార్జ్ కాగా
*13,723 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,677#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/wZvS2O3T3a