ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా ఎన్ని కేసులంటే..
1085 New Corona Cases In AP. ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,085 పాజిటివ్ కేసులు నమోదు కాగా
By Medi Samrat Published on 24 Nov 2020 12:29 PM GMT
ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,085 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఎనిమిది మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,63,843 చేరగా, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 6,956కి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో 1,447 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,43,863కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 97,27,321 కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇక తాజాగా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలు.. అనంతపురం 10, చిత్తూరు - 142, తూర్పు గోదావరి 116, గుంటూరు 126, కడప 57, కృష్ణ 224, కర్నూలు 31, నెల్లూరు -50, ప్రకాశం - 42, శ్రీకాకుళం - 26, విశాఖ - 86, విజయనగరం - 37, పశ్చిమగోదావరి - 138 చొప్పున పాజిటివ్ కేసులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కాగా, రాష్ట్రంలో రోజు వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు. వ్యాక్సిన్ వచ్చే వరకైనా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి పాటిస్తే పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి.. ఇంకా ప్రబలుతూనే ఉంది.