ఏపీ కరోనా బుటిలెన్.. తగ్గిన కేసులు.. 80 మరణాలు
10373 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో
By Medi Samrat Published on
5 Jun 2021 12:11 PM GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 88,441 శాంపిళ్లను పరీక్షించగా.. 10,373 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 17,49,363కి చేరింది. నిన్న 15,958 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,09,879కి పెరిగింది.
కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, అనంతపూర్ లో తొమ్మిది, శ్రీకాకుళం లో తొమ్మిది, విజయనగరం లో తొమ్మిది, కర్నూల్ లో ఆరుగురు, నెల్లూరు లో ఆరుగురు, పశ్చిమ గోదావరి లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, గుంటూరు లో ఐదుగురు, విశాఖపట్నం లో ఐదుగురు, కృష్ణ లో నలుగురు, ప్రకాశం లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు చొప్పున మొత్తం 80 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,376కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,28,108 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 1,97,08,031 సాంపిల్స్ ని పరీక్షించారు.
Next Story