ఏపీలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 10 వేలు దాటిన పెరిగిన కేసులు

10,057 New corona cases reported in AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రాష్ట్రంలో భారీగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.

By అంజి  Published on  19 Jan 2022 11:36 AM GMT
ఏపీలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 10 వేలు దాటిన పెరిగిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రాష్ట్రంలో భారీగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోల్చితే కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,713 పరీక్షలు నిర్వహించగా.. 10,057 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు బుధవారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,12,7441కి చేరింది. క‌రోనా వ‌ల్ల 8 మంది మృత్యువాత ప‌డ్డారు.

కోవిడ్ వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14522గా ఉంది. 24 గంటల వ్యవధిలో 1,222 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,67,984కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,935 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,19,64,682 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story