ఏపీ కరోనా బులెటిన్‌ విడుదల.. కొత్త కేసులు ఎన్నంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sep 2020 12:07 PM GMT
ఏపీ కరోనా బులెటిన్‌ విడుదల.. కొత్త కేసులు ఎన్నంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 71,137 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,999 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,47,686కి చేరింది.

కొవిడ్‌ వల్ల కడపలో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, నెల్లూరులో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, గుంటూరులో ఏడుగురు, కృష్ణలో ఏడుగురు, అనంతపూర్‌లో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, విజయనగరంలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూల్‌లో ఒక్కరు చొప్పున మొత్తం 77 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,779కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 5,47,686 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 96,191 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 557,

చిత్తూరులో 1040,

ఈస్ట్‌ గోదావరిలో 1499,

గుంటూరులో 920,

కడపలో 698,

కృష్ణలో 451,

కర్నూలులో 497,

నెల్లూరులో 778,

ప్రకాశంలో 901,

శ్రీకాకుంలో 570,

విశాఖపట్నంలో 413,

విజయనగరంలో 594,

పశ్చిమ గోదావరి 1081 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story