ఏపీలో క‌రోనా బీభ‌త్సం.. కొత్త‌గా 9,996 కేసులు.. 82 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 10:47 AM GMT
ఏపీలో క‌రోనా బీభ‌త్సం.. కొత్త‌గా 9,996 కేసులు.. 82 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో 55,692 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,996 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,64,142కి చేరింది.

కొవిడ్‌ వల్ల తూర్పుగోదావ‌రిలో పది మంది, గుంటూరులో పది మంది, అనంత‌పూర్‌లో ఎనిమిది మంది, క‌డ‌ప‌లో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, క‌ర్నూలులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, ప్ర‌కాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విజయనగరంలో ఐదుగురు, విశాఖ‌ప‌ట్నంలో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, కృష్ణలో ఒక్క‌రు చొప్పున మొత్తం 82మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 2378 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 1,70,924 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 90,840 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 856,

చిత్తూరులో 963,

ఈస్ట్‌ గోదావరిలో 1504,

గుంటూరులో 595,

కడపలో 784,

కృష్ణలో 330,

కర్నూలులో 823,

నెల్లూరులో 682,

ప్రకాశంలో 681,

శ్రీకాకుంలో 425,

విశాఖపట్నంలో 931,

విజయనగరంలో 569,

పశ్చిమ గోదావరిలో 853 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story