తెలంగాణ‌లో క‌రోనా ఉగ్ర‌రూపం.. నేడు కొత్త‌గా 879 కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2020 3:27 PM GMT
తెలంగాణ‌లో క‌రోనా ఉగ్ర‌రూపం.. నేడు కొత్త‌గా 879 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3006 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 879 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 9553 కేసులు నమోదు కాగా, 220 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 652 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 64 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 112 కేసులు, వ‌రంగ‌ల్ రూర‌ల్‌ జిల్లాలో 14 కేసులు, కామారెడ్డిలో 10 కేసులు నమోదయ్యాయి. గ‌త వారం రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 4224 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 5109 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 219 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

T1

Next Story