ఏపీలో కొత్తగా మరో 7,822 కేసులు.. 63 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 3 Aug 2020 7:07 PM ISTఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 7వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 45,516 శాంపిల్స్ను పరీక్షించగా.. 7,822 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,586కి చేరింది.
కొవిడ్ వల్ల పశ్చిమగోదావరిలో పదకొండు మంది, విశాఖపట్నంలో తొమ్మిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, నెల్లూరులో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, విజయనగరంలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణలో ముగ్గురు, కర్నూల్లో ముగ్గురు, అనంతపూర్లో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు చొప్పున మొత్తం 63 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,537 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 88,672 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 76,377 మంది చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 953,
చిత్తూరులో 240,
ఈస్ట్ గోదావరిలో 1113,
గుంటూరులో 573,
కడపలో 576,
కృష్ణలో 240,
కర్నూలులో 602,
నెల్లూరులో 500,
ప్రకాశంలో 364,
శ్రీకాకుంలో 495,
విశాఖపట్నంలో 1049,
విజయనగరంలో 677,
పశ్చిమ గోదావరిలో 440 చొప్పున కేసులు నమోదు