ఏపీలో కొత్తగా 7,738 కేసులు.. 57 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Sep 2020 12:31 PM GMT
ఏపీలో కొత్తగా 7,738 కేసులు.. 57 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 70,455 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,738 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,25,514కి చేరింది.

కొవిడ్‌ వల్ల కృష్ణలో ఎనిమిది మంది, అనంతపూర్‌లో ఏడుగురు, చిత్తూరులో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కర్నూల్‌లో నలుగురు, కడపలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మొత్తం 57 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,359కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 5,41,319 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 78,863 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 539,

చిత్తూరులో 794,

ఈస్ట్‌ గోదావరిలో 1260,

గుంటూరులో 582,

కడపలో 267,

కృష్ణలో 439,

కర్నూలులో 275,

నెల్లూరులో 444,

ప్రకాశంలో 869,

శ్రీకాకుంలో 476,

విశాఖపట్నంలో 342

విజయనగరంలో 446,

పశ్చిమ గోదావరి 1005 చొప్పున కేసులు నమోదు అయ్యాయి



Next Story