ఏపీలో కొత్తగా 7,293 కేసులు.. 57 మరణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2020 12:45 PM GMT
ఏపీలో కొత్తగా 7,293 కేసులు.. 57 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 75,990 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,293 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,687,51కి చేరింది.

కొవిడ్‌ వల్ల ప్రకాశంలో ప‌ది మంది, చిత్తూర్‌లో ఎనిమిది మంది, క‌డ‌ప‌లో ఎనిమిది మంది, కృష్ణ‌లో ఆరుగురు, విశాఖ‌ప‌ట్నంలో ఐదుగురు, తూర్పుగోదావ‌రిలో న‌లుగురు, ప‌శ్చిమ‌గోదావరిలో న‌లుగురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, అనంత‌పూర్‌లో ఇద్ద‌రు, శ్రీకాకుళంలో ఇద్ద‌రు, కర్నూల్‌లో ఒక్క‌రు చొప్పున 57 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,663కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 5,97,294 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 65,794 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 513,

చిత్తూరులో 975,

ఈస్ట్‌ గోదావరిలో 1011,

గుంటూరులో 393,

కడపలో 537,

కృష్ణలో 450,

కర్నూలులో 206,

నెల్లూరులో 466,

ప్రకాశంలో 620,

శ్రీకాకుంలో 306,

విశాఖపట్నంలో 450,

విజయనగరంలో 444,

పశ్చిమ గోదావరి 922 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story