ఏపీ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sep 2020 11:29 AM GMT
ఏపీ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 72,838 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,228 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,46,530కి చేరింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, కృష్ణలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కర్నూల్‌లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున 45 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,506కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 5,70,667 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 70,357 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 612,

చిత్తూరులో 536,

ఈస్ట్‌ గోదావరిలో 1112,

గుంటూరులో 648,

కడపలో 600,

కృష్ణలో 428,

కర్నూలులో 229,

నెల్లూరులో 479,

ప్రకాశంలో 502,

శ్రీకాకుంలో 319,

విశాఖపట్నంలో 414,

విజయనగరంలో 387,

పశ్చిమ గోదావరి 962 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story