ఏపీ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?
By తోట వంశీ కుమార్ Published on 30 Sept 2020 6:00 PM ISTఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 71,806 శాంపిల్స్ను పరీక్షించగా.. 6,133 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,93,484కి చేరింది.
కొవిడ్ వల్ల చిత్తూరులో ఎనిమిది మంది, ప్రకాశంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కృష్ణలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, అనంతపూర్లో నలుగురు, గుంటూరులో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కడపలో ముగ్గురు, కర్నూల్లో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున 48 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,828కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6,29,211 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 58,445 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 580,
చిత్తూరులో 925,
ఈస్ట్ గోదావరిలో 983,
గుంటూరులో 498,
కడపలో 387,
కృష్ణలో 446,
కర్నూలులో 216,
నెల్లూరులో 415,
ప్రకాశంలో 324,
శ్రీకాకుంలో 362,
విశాఖపట్నంలో 235,
విజయనగరంలో 298,
పశ్చిమ గోదావరి 464 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.