ఏపీలో క‌రోనా బీభ‌త్సం.. ఒక్క‌రోజులో 5041 కేసులు.. 56 మ‌ర‌ణాలు

By Medi Samrat  Published on  19 July 2020 2:21 PM GMT
ఏపీలో క‌రోనా బీభ‌త్సం.. ఒక్క‌రోజులో 5041 కేసులు.. 56 మ‌ర‌ణాలు

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31,148 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,041 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 49650కి చేరింది.

కొవిడ్‌ వల్ల తూర్పుగోదావరిలో ప‌ది మంది, గుంటూరులో ఎనిమిది మంది, శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది మంది, క‌ర్నూలు జిల్లాలో ఏడుగురు, విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఏడుగురు, ప్రకాశంలో నలుగురు, అనంత‌పురంలో ముగ్గురు, క‌డ‌ప‌లో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్ద‌రు, చిత్తూరు జిల్లాలో ఇద్ద‌రు చొప్పున మొత్తం 56 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 642 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 22890 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 26118 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 637,

చిత్తూరులో 440,

ఈస్ట్‌ గోదావరిలో 647,

గుంటూరులో 354,

కడపలో 226,

కృష్ణలో 397,

కర్నూలులో 364,

నెల్లూరులో 391,

ప్రకాశంలో 150,

శ్రీకాకుంలో 535,

విశాఖపట్నంలో 266,

విజయనగరంలో 241,

పశ్చిమ గోదావరిలో 393 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story