భారత్‌లో కరోనా విలయం.. 24గంటల్లో 38,902కేసులు.. 543 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2020 4:38 AM GMT
భారత్‌లో కరోనా విలయం.. 24గంటల్లో 38,902కేసులు.. 543 మంది మృతి

భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 38,902 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 543 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,77,618కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 26,816 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం నమోదు అయిన కేసుల్లో 6,77,423 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 3,73,379 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,37,91,869 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,58,127 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 2.93లక్షల కేసులు నమోదు కాగా.. 11,452 మంది మృత్యువాత పడ్డారు. తమిళనాడులో 1.61కేసులు నమోదు కాగా.. 2,315 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో 1.20లక్షల కేసులు నమోదు కాగా.. 3,571 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది.

Next Story