ఏపీలో ఆరు వేలు దాటిన కరోనా మరణాలు
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 Oct 2020 7:00 PM ISTఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 56,145 శాంపిల్స్ను పరీక్షించగా.. 4,256 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 7,23,512కి చేరింది.
కొవిడ్ వల్ల కృష్ణలో ఏడుగురు, చిత్తూరులో ఐదుగురు, కడపలో ఐదుగురు, అనంతపూర్లో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, తూర్పుగోదావరిలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున 38 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 6,019కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6,66,433 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 51,060 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 271,
చిత్తూరులో 224,
ఈస్ట్ గోదావరిలో 853,
గుంటూరులో 444,
కడపలో 231,
కృష్ణలో 179,
కర్నూలులో 86,
నెల్లూరులో 365,
ప్రకాశంలో 666,
శ్రీకాకుళంలో 157,
విశాఖపట్నంలో 138,
విజయనగరంలో 129,
పశ్చిమ గోదావరి 513 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.