ఏపీలో కరోనా విలయతాండవం.. కొత్తగా 3963 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2020 10:45 AM GMT
ఏపీలో కరోనా విలయతాండవం.. కొత్తగా 3963 కేసులు

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 23,872 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 3963 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 44609కి చేరింది.

కొవిడ్‌ వల్ల తూర్పుగోదావరిలో పన్నెండు మంది, గుంటూరులో ఎనిమిది మంది, కృష్ణలో ఎనిమిది మంది, అనంతపూర్‌లో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, కడపలో ఒక్కరు మరియు విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 52 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 586 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 21763 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 22260 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 220,

చిత్తూరులో 343,

ఈస్ట్‌ గోదావరిలో 994,

గుంటూరులో 214,

కడపలో 145

కృష్ణలో 130,

కర్నూలులో 550,

నెల్లూరులో 278,

ప్రకాశంలో 266,

శ్రీకాకుంలో 182,

విశాఖపట్నంలో 116,

విజయనగరంలో 118,

పశ్చిమ గోదావరిలో 407 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story