ఏపీ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Oct 2020 12:32 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 74,757 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,901 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,11,825కి చేరింది.

కొవిడ్‌ వల్ల క‌డ‌ప‌లో న‌లుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణ‌లో ముగ్గురు, తూర్పుగోదావ‌రిలో ఇద్ద‌రు, ప్ర‌కాశంలో ఇద్ద‌రు, అనంత‌పురంలో ఒక్క‌రు, గుంటూరులో ఒక్క‌రు, క‌ర్నూల్‌లో ఒక్క‌రు, విశాఖ‌ప‌ట్నంలో ఒక్క‌రు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఒక్క‌రు చొప్పున 19 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 6,625కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 7,77,900 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 27,300 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story