తెలంగాణ‌లో కొత్త‌గా 2,384 కేసులు.. 11 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Aug 2020 3:20 AM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా 2,384 కేసులు.. 11 మ‌ర‌ణాలు

తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,384 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొత్తగా 11మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,04,249కు చేరగా, మృతుల సంఖ్య 755కి చేరింది.

తాజాగా 1,851 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 80,586కు చేరింది. ఇక ప్రస్తుతం 22,908 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక తాజాగా నమోదైన కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో 472, మేడ్చల్ 52, కరీంనగర్ 120, వరంగల్‌ అర్బన్ 85, రంగారెడ్డి 131, నల్గొండ 137, నిజామాబాద్ 148, సిద్ధిపేటలలో 67 కేసులు నమోదయ్యాయి.



Next Story