కేరళలో కూలిన కూలిన గ్లైడర్.. ఇద్దరు నావికా సిబ్బంది మృతి
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Oct 2020 10:09 AM GMTభారత నావికాదళానికి చెందిన ఓ శిక్షణ విమానం కప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు నేవీ అధికారులు మరణించారు. కేరళలోని కొచ్చి నావికాస్థావరానికి సమీపంలో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. రోజువారీ శిక్షణలో భాగంగా ఈ రోజు ఉదయం పవర్ గ్లైడర్.. ఐఎన్ఎస్ గరుడ నుంచి బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కొచ్చిలోని నావెల్ బేస్ సమీపంలో ఉన్న తొప్పంపాడి బ్రిడ్జి వద్ద కుప్పకూలిపోయింది. దీంతో అందులో ఉన్న నేవీ అధికారులు లెఫ్టినెంట్ రాజీవ్ ఝా (39), పెట్టీ ఆఫీసర్ సునీల్ కుమార్ (29) అక్కడిక్కడే మరణించారు.
ప్రమాద ఘటనపై నౌకాదళ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రాజీవ్ ఝా ఉత్తరాఖండ్కు చెందినవారు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సునీల్ కుమార్ స్వస్థలం బీహార్. ఆయనకు ఇంకా వివాహం కాలేదు. రెండు రోజుల క్రితం కర్ణాటకలోని కర్వార్ ప్రాంతంలో శిక్షణ విమానం కూలింది. విమానం సముద్రంలో పడిపోవడంతో ఓ అధికారి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.