తెలంగాణ‌లో కొత్త‌గా 1278 క‌రోనా పాజిటివ్ కేసులు

By Medi Samrat  Published on  10 July 2020 4:55 PM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా 1278 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10354 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1278 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ఎనిమిది మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 32,224 కేసులు నమోదు కాగా, 339 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 762 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 171 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 85 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 36 కేసులు, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌‌ జిల్లాలో 14 కేసులు, న‌ల్గొండ‌ జిల్లాలో 32 కేసులు, మెద‌క్‌‌ జిల్లాలో 22 కేసులు, కామారెడ్డి జిల్లాలో 23 కేసులు, ఖ‌మ్మం జిల్లాలో 18 కేసులు, సూర్యాపేట జిల్లాలో 14 కేసులు, అదిలాబాద్ జిల్లాలో 14 కేసులు, మంచిర్యాల జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. గ‌త ఇర‌వై రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19205 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 12680 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 1013 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.‌



Next Story