ఏపీలో కొత్తగా 1608 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 July 2020 8:30 AM GMT
ఏపీలో కొత్తగా 1608 కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 21,020 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 1608 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 1576 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 32 మంది ఉన్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 25,422కి చేరింది.

కొవిడ్‌ వల్ల అనంతపూర్‌, చిత్తూరు, గుంటూరు, కృష్ణ, కర్నూలు జిల్లాలో ఇద్దరు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 292కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 13,194 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 11,936మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా

అనంతపురంలో 191,

చిత్తూరులో 208,

ఈస్ట్‌ గోదావరిలో 169,

గుంటూరులో 136,

కడపలో 91,

కృష్ణలో 80,

కర్నూలులో 144,

నెల్లూరులో 51,

ప్రకాశంలో 110,

శ్రీకాకుంలో 80,

విశాఖపట్నంలో 86,

విజయనగరంలో 86,

పశ్చిమ గోదావరిలో 144 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story