తెలంగాణ‌లో కొత్త‌గా 1178 క‌రోనా పాజిటివ్ కేసులు

By Medi Samrat  Published on  11 July 2020 4:29 PM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా 1178 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11062 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1178 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 33402 కేసులు నమోదు కాగా, 348 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 736 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 125 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 101 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 13 కేసులు, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌‌ జిల్లాలో 20 కేసులు, క‌రీంన‌గ‌ర్‌‌ జిల్లాలో 24 కేసులు, మెద‌క్‌‌ జిల్లాలో 16 కేసులు, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో 12 కేసులు, పెద్ద‌ప‌ల్లి జిల్లాలో 12 కేసులు, న‌ల్గొండ‌ జిల్లాలో 12 కేసులు, రాజ‌న్న సిరిసిల్లా జిల్లాలో 24 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. గ‌త నెల‌ రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 20919 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 12135 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 1714 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.‌



Next Story