తెలంగాణ‌లో క‌రోనా బీభ‌త్సం.. తొలిసారి వెయ్యికి పైగా కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Jun 2020 4:58 PM GMT
తెలంగాణ‌లో క‌రోనా బీభ‌త్సం.. తొలిసారి వెయ్యికి పైగా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3923 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1087 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 13436 కేసులు నమోదు కాగా, 243 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 888 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 74 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 37 కేసులు, న‌ల్గొండ‌ జిల్లాలో 35 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. గ‌త వారం రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 4928 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 8265 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 162 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.‌

01

Next Story