ఏపీలో మరో 796 పాజిటివ్‌ కేసులు నమోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jun 2020 8:24 AM GMT
ఏపీలో మరో 796 పాజిటివ్‌ కేసులు నమోదు

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 24,458 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 796 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 740 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51 మంది.. 5గురు విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12285కి చేరింది.

ఈ రోజు కొవిడ్‌ వల్ల కృష్ణలో నలుగురు, కర్నూల్‌లో నలుగురు, తూర్పుగోదావరిలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు మొత్తం 11మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 157కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 5480 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 6648మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అనంతపురంలో 161, చిత్తూరులో 84, ఈస్ట్‌ గోదావరిలో 109, గుంటూరులో 71, కడపలో 50, కృష్ణలో 53, కర్నూలులో 69, నెల్లూరులో 24, ప్రకాశంలో 26, విశాఖపట్నంలో 34, విజయనగరంలో 15, పశ్చిమ గోదావరిలో 44 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Untitled 8 Copy

Next Story