ఏపీలో కొత్తగా మరో 10,621 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 27 Aug 2020 5:24 PM ISTఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 61,300 శాంపిల్స్ను పరీక్షించగా.. 10,621 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,93,090కి చేరింది.
కొవిడ్ వల్ల కర్నూల్లో పదమూడు మంది, నెల్లూరులో పదకొండు మంది, తూర్పుగోదావరిలో పది మంది, చిత్తూరులో తొమ్మిది మంది, కడపలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, అనంతపూర్లో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, కృష్ణలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో నలుగరు చొప్పున మొత్తం 92 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,633 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2,95,248 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 94,209 మంది చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 815,
చిత్తూరులో 928,
ఈస్ట్ గోదావరిలో 1089,
గుంటూరులో 926,
కడపలో 844,
కృష్ణలో 316,
కర్నూలులో 855,
నెల్లూరులో 934,
ప్రకాశంలో 1020,
శ్రీకాకుంలో 846,
విశాఖపట్నంలో 593,
విజయనగరంలో 563,
పశ్చిమ గోదావరిలో 892 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.