సచిన్ ముందే 50వ సెంచ‌రీ చేసిన కోహ్లీ..!

2023 ప్రపంచకప్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న‌ సెమీఫైనల్‌లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

By Medi Samrat  Published on  15 Nov 2023 12:21 PM GMT
సచిన్ ముందే 50వ సెంచ‌రీ చేసిన కోహ్లీ..!

2023 ప్రపంచకప్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న‌ సెమీఫైనల్‌లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. తన వన్డే కెరీర్‌లో 50వ సెంచరీని నమోదు చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంలో గ్రేట్ సచిన్ టెండూల్కర్‌ను విరాట్ దాటేశాడు. ఈ మ్యాచ్‌ని చూసేందుకు సచిన్ వాంఖడేకు వ‌చ్చాడు. త‌న‌ముందే త‌న రికార్డ్‌ను కోహ్లీ అధిగ‌మించాడు.

ఇదిలావుంటే.. అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా కోహ్లీ ముందున్నాడు. సచిన్ 452 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు సాధించాడు. కోహ్లీ తన 279వ ఇన్నింగ్స్‌లో 50వ‌ సెంచరీ సాధించాడు. కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో అతను తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. సెంచ‌రీ అనంత‌రం సౌదీ బౌలింగ్‌లో కోహ్లి.. కాన్వాయ్ చేతికి చిక్కాడు.

విరాట్ ఏదైనా ఒక ప్రపంచకప్‌లో 50కి పైగా ప‌రుగులు చేసిన రికార్డును కూడా సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇది అతని ఎనిమిదో 50+ స్కోరు. దీనికి ముందు సచిన్ 2003 ప్రపంచకప్‌లో, 2019లో షకీబ్ అల్ హసన్‌లో తలా ఏడుసార్లు 50+ స్కోరు చేశారు.

Next Story