ఆ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సుచరిత

By అంజి  Published on  21 Nov 2019 9:43 AM GMT
ఆ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సుచరిత

విజయవాడ: మహిళలు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మహిళలపై సైబర్‌ నేరాలు తీసుకోవల్సిన చర్యలపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడారు. మహిళలపై సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. నేరస్తులను పట్టుకోవడం చాలా కష్టంగా మారిందని పేర్కొన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం మహిళల వేధింపులకు కారణం అవుతున్నాయని.. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలని మంత్రి సుచరిత తెలిపారు. సైబర్‌ నేరస్తులను అరికట్టేందుకు సైబర్‌ మిత్రను ఏర్పాటు చేశామన్నారు. సైబర్‌ నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సుచరిత తెలిపారు.

Next Story