పాఠశాలలకు సెలవు ప్రకటించేసిన ప్రభుత్వం

బంగాళాఖాతంలో పెను తుపాను తీవ్రరూపం దాల్చడంతో పాటు పుదుచ్చేరి సమీపానికి దూసుకుపోతున్న నేపథ్యంలో తమిళనాడు అధికారులు అత్యవసర సూచనలు జారీ చేశారు.

By Kalasani Durgapraveen
Published on : 30 Nov 2024 6:30 AM IST

పాఠశాలలకు సెలవు ప్రకటించేసిన ప్రభుత్వం

బంగాళాఖాతంలో పెను తుపాను తీవ్రరూపం దాల్చడంతో పాటు పుదుచ్చేరి సమీపానికి దూసుకుపోతున్న నేపథ్యంలో తమిళనాడు అధికారులు అత్యవసర సూచనలు జారీ చేశారు. భారీ వర్షపాతం, బలమైన గాలులు వచ్చే అవకాశం ఉన్న కారణంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అనేక జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయడానికి, ప్రజా రవాణా సేవలను నిలిపివేశాయి. IT కంపెనీలు వర్క్-ఫ్రమ్-హోమ్ ప్రోటోకాల్‌లను అమలు చేయాలని కోరాయి.

విద్యార్థుల భద్రత కోసం తమిళనాడు ప్రభుత్వం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను నవంబర్ 30న మూసివేయాలని ఆదేశించింది. ఈ సమయంలో గాలులు గంటకు 90 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక తరగతులు లేదా పరీక్షలు నిర్వహించరు. భారీ వర్షపాతం హెచ్చరికలతో ఇతర జిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా, తమిళనాడు ప్రభుత్వం నవంబర్ 30 మధ్యాహ్నం సమయంలో ఈస్ట్ కోస్ట్ రోడ్ (ECR), పాత మహాబలిపురం రోడ్ (OMR)తో సహా కీలకమైన రోడ్లపై ప్రజా రవాణా సేవలను కూడా నిలిపివేసింది.

Next Story