ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.

By Srikanth Gundamalla
Published on : 3 Jun 2024 2:45 PM IST

Monsoon,  Telangana, rains,

 ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు 

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఆదివారం సాయంత్రం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి మొత్తం నిరంతరాయం వర్షం పడింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టింది. ఆ తర్వాత వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని చెప్పారు.

నాగర్‌కర్నూల్‌, గద్వాల్, నల్లగొండలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో పాటుగా రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా జూన్ రెండో వారంలో తెలంగాణను తాకుతాయి నైరుతి రుతుపవనాలు. కానీ.. ఈ ఏడాది వారం రోజుల ముందుగానే వచ్చేశాయి. ఈ నేపథ్యంలో రైతులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముందుగానే పంటలు వేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు. ఇక మంగళవారం నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Next Story