తెలుగు రాష్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

By -  అంజి
Published on : 5 Oct 2025 6:44 AM IST

Meteorological Center, districts , Telugu states , heavy rains, IMD, APSDMA

తెలుగు రాష్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేటలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది.

కాసేపట్లో హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయి. నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 50-60 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, చెట్ల కింద ఉండొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల లోతట్టు ప్రాంత ప్రజలు పూర్తిగా వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Next Story