మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
By - అంజి |
మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రేపు రాష్ట్రంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గాలుల వేగం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల మధ్య ఉంటుందని వివరించింది.
0900 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (शाम) 1730 बजे IST पर जारी किया गया/7-day forecast(EVENING) of TELANGANA based on 0900 UTC issued at 1730 hours IST Dated : 26/10/2025 pic.twitter.com/OR0hANNMfA
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) October 26, 2025