వరంగల్‌ కేఎంసీలో మరోసారి ర్యాగింగ్‌ కలకలం

Ragging in warangal kakatiya medical college. వరంగల్‌లోని కేఎంసీ (కాకతీయ మెడికల్‌ కాలేజీ)లో మరోసారి ర్యాగింగ్‌ కలకలం రేపుతోంది. తమను కాపాడాలంటూ ఓ విద్యార్థి ప్రముఖులకు ట్విట

By అంజి  Published on  15 Nov 2021 3:18 AM GMT
వరంగల్‌ కేఎంసీలో మరోసారి ర్యాగింగ్‌ కలకలం

వరంగల్‌లోని కేఎంసీ (కాకతీయ మెడికల్‌ కాలేజీ)లో మరోసారి ర్యాగింగ్‌ కలకలం రేపుతోంది. తమను కాపాడాలంటూ ఓ విద్యార్థి ప్రముఖులకు ట్విటర్‌ వేదికగా ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మెడికల్‌ కాలేజీకి వెళ్లి విచారణ చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2 రోజుల క్రితం థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులు ఫ్రెషర్స్‌ డే పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఫోర్త్‌ ఇయర్‌ విద్యార్థులను ఆహ్వానించారు. ఫ్రెషర్స్‌ డే వేడుకలో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. థర్డ్‌ ఇయర్ విద్యార్థులు తమను గౌరవించడం లేదని, మర్యాద ఇవ్వడం లేదని, దీంతో సీనియర్లు ఆగ్రహించారని తెలుస్తోంది.

ఈ ఘటనపై ఆదివారం నాడు ఓ విద్యార్థి ట్వీటర్‌ వేదికగా ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మంత్రి కేటీఆర్‌, తెలంగాణ డీజీపీ, వరంగల్‌ సీపీతో పాటు మరో 8 మందికి ట్యాగ్‌ చేస్తూ పలు ఆరోపణలు చేశాడు. కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌ ఘటనలు జరుగుతున్నాయి.. దయచేసి కాపాడాలని, వారంతా తప్ప తాగి జూనియర్ల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, దయచేసి కాపాడాలని కోరాడు. కాగా ఈ ఘటనపై స్పందించిన వరంగల్‌ సీపీ వెంటనే విచారణకు ఆదేశించాడు. మట్టెవాడ పోలీసులు కేఎంసీలో విచారణ చేపట్టారు. న్యూమెన్స్‌ హాస్టల్‌లో ఏం జరుగుతోందన్న దాని.. ట్విటర్‌లో విద్యార్థి చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపారు.

Next Story