వరంగల్లో మరో దారుణం... బాలికపై అత్యాచారయత్నం
By Newsmeter.Network Published on 2 Dec 2019 2:16 PM ISTవెటర్నరీ వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యం మరువకముందే మరెన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్యలు, మానభంగాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా...మానవమృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటనలపై తీవ్రంగా ఖండిస్తూ... నిందితులకు తక్షణమే ఉరి శిక్ష అమలయ్యేలా చర్యలు చేపట్టాలని గగ్గోలు పెడుతుంటే .... తాజాగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోచోటు చేసుకున్న మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ గిరిజన బాలికపై ఆర్ఎంపీవైద్యుడు అత్యాచారయత్నానికి పాల్పడటం సంచలనంగామారింది.
మండలంలోని జులైవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ బాలిక 8వ తరగతి చదువుతోంది. అక్కడే పాఠశాలకు దగ్గరలో ఉన్న ఎస్టీ హాస్టల్లో ఉంటోంది. గతనెల 28న బాధిత విద్యార్థినికి కంటిపై కురుపు రావడంతో చికిత్స కోసం ఆర్ఎంపీ వైద్యుడు రాజు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో రాజు బాలికకు మత్తు మందు ఇచ్చి ఒంటిపై ఉన్న వస్త్రాలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పాఠశాలకు, హాస్టల్కు మధ్య ఉన్న యశ్వంత్ క్లినిక్లో ఆర్ఎంపీ రాజు మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న రాజు ఈ ఘటనకు పాల్పడటంతో బాధిత కుటుంబ సభ్యులు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడు రాజుపై ఐపీసీ 354, 509 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేషనప్త్తి్తవిచారణ చేపట్టారు.