రేపటి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్‌ విశాఖపట్నం పర్యటన

CM Jagan will visit Visakhapatnam. రేపటి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్‌ విశాఖపట్నంలో పర్యటించ‌నున్నారు.

By Medi Samrat  Published on  1 March 2023 3:45 PM GMT
రేపటి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్‌ విశాఖపట్నం పర్యటన

CM Jagan


రేపటి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్‌ విశాఖపట్నంలో పర్యటించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం వైఎస్‌ జగన్ పాల్గొననున్నారు. ఈ మేర‌కు సీఎంఓ అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

02.03.2023 షెడ్యూల్‌

సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

03.03.2023 షెడ్యూల్‌

ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. రాత్రి 8.00 – 9.00 ఎంజీఎం పార్క్‌ హోటల్‌లో జీఐఎస్‌ డెలిగేట్స్‌కు ఏర్పాటుచేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు, అనంతరం రాత్రి విశాఖపట్నంలోనే బస చేస్తారు.

04.03.2023 షెడ్యూల్‌

ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story