ఒక వ్యక్తి కారు పార్కింగ్ విషయంలో జరిగిన గొడవలో రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శి ముక్కును గట్టిగా కొరికి గాయపరిచాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది. బాధితుడు ఆర్ఎస్ యాదవ్ను అతని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, నిందితుడు క్షితిజ్ మిశ్రాపై కేసు నమోదు చేశారు.
నరమౌ ప్రాంతంలోని రతన్ ప్లానెట్ రెసిడెన్షియల్ సొసైటీలో కార్ పార్కింగ్ వివాదంపై యాదవ్, మిశ్రా తీవ్ర వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో మిశ్రా.. యాదవ్పై గట్టిగా అరుస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపు వాదన తర్వాత మిశ్రా.. యాదవ్ను మూడు-నాలుగు సార్లు కొట్టి, ముక్కు తెగిపోయేలా కొరకడం కనిపించింది. కొన్ని క్షణాల తర్వాత నిందితుడు క్షితిజ్ మిశ్రా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మిశ్రా సొసైటీ కార్యదర్శి యాదవ్కు ఫోన్ చేసి ఎవరో తమ కారుకు కేటాయించిన స్లాట్లో తప్పుగా పార్క్ చేశారని, అక్కడి నుంచి దాన్ని తీసివేయమని కోరాడు. అంతే ఈ గొడవ కాస్తా పెద్దదై ముక్కు కొరికేసుకునే దాకా వెళ్ళింది.