ఈనెల 10 నుంచి మంగ‌ళ‌గిరిలో సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 10 నుండి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ -2025 పోటీలు జరగనున్నాయి.

By Medi Samrat  Published on  7 Feb 2025 9:16 PM IST
ఈనెల 10 నుంచి మంగ‌ళ‌గిరిలో సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 10 నుండి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ -2025 పోటీలు జరగనున్నాయి. విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) కార్యాలయం నేతృత్వంలో తొలిసారి సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించబడుతోంది. ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ లో దక్షిణాది నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్లు పాల్గొని తలపడనున్నాయి.

తొలిసారిగా ఈ క్రీడలను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తోండటం గర్వించదగ్గ విషయం. ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ కు అర్హత పొందేందుకు ఈ టోర్నమెంట్ ఉపయోగపడనుందని ఆడిట్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులు జాతీయస్థాయిలో వారి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందుతారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవం 10 ఫిబ్రవరి, 2025న ఉదయం 8 గం.లకు జరుగుతుంది. 13 ఫిబ్రవరి, 2025న మధ్యాహ్నం 1.30 గం.లకు ముగింపు వేడుకతో టోర్నమెంట్ ముగుస్తుంది..క్రీడాభిమానం ఉన్న ప్రతిఒక్కరూ సంబంధిత మ్యాచ్ లు వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Next Story