ఏపీ క‌రోనా బులిటెన్‌.. పెరిగిన కేసులు

264 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా

By Medi Samrat  Published on  24 Nov 2021 3:15 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. పెరిగిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31,987 పరీక్షలు నిర్వహించగా.. 264 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,831కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల కృష్ణా జిల్లాలో ఒక‌రు మ‌ర‌ణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,430గా ఉంది. 24 గంటల వ్యవధిలో 247 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,55,226కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,175 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,02,55,667 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story