ఏపీ కరోనా బులిటెన్.. స్వల్పంగా పెరిగిన కేసులు
174 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 24,659
By Medi Samrat Published on
21 Nov 2021 11:52 AM GMT

ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 24,659 పరీక్షలు నిర్వహించగా.. 174 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,244కి చేరింది. నిన్న కరోనా వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,426గా ఉంది. 24 గంటల వ్యవధిలో 301 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,54,553కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,265 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,01,78,784 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Next Story