రాహుల్ ఆ బాధ్య‌త తీసుకుంటార‌ని విశ్వ‌సిస్తున్నా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Aug 2020 3:48 AM GMT
రాహుల్ ఆ బాధ్య‌త తీసుకుంటార‌ని విశ్వ‌సిస్తున్నా..

కాంగ్రెస్ పార్టీలో జ‌రుగుతున్న ప్ర‌స్తుత ప‌రిణామాల‌పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్, ఫైర్‌బ్రాండ్‌ విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిన్న దాదాపు 7 గంటలపాటు జ‌రిగిన సీడబ్ల్యూసీ స‌మావేశం.. మరో ఆరు నెలల పాటు సోనియా గాంధీయే అధ్యక్షురాలిగా కొనసాగుతారని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుత ప‌రిణామాల‌పై విజ‌య‌శాంతి స్పందించారు.



ఈ మేర‌కు విజయశాంతి.. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం చేసిన సేవలు చిరస్మరణీయం. అయితే ప్రస్తుతం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చి పరిష్కారమవుతాయని.. పటిష్ట నాయకత్వంతో పార్టీ ముందడుగు వేస్తుందని ఆ బాధ్యత శ్రీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని విశ్వసిస్తున్నాన‌ని ట్వీట్ చేశారు.

Next Story