మహిళా కానిస్టేబుల్కు చేయూత
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 March 2020 3:17 PM GMTమహిళా కానిస్టేబుల్కు చికిత్స నిమిత్తం ఆర్ధికసాయం అందజేశారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సీసీఆర్బిలో డి.శిల్ప(24) అనే మహిళా కానిస్టేబుల్ పనిచేస్తోంది. ఆమె కొంతకాలంగా 'Pulmonary Endarterectomy' అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి సంబంధించి చికిత్సను బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో మాత్రమే చేస్తారని వైద్యులు తెలిపారు. ఈ విషయమై శిల్ప.. వైద్య చికిత్సకై స్పెషల్ పర్మిషన్ ఇవ్వవలసిందిగా డీజీపీ మహేందర్ రెడ్డికి కోరారు.
ఈ విషయమై వెంటనే స్పందిచిన.. డీజీపీ శిల్ప ట్రీట్మెంట్ కోసం ఆరోగ్య భద్రత ద్వారా రూ. 9,12,320/-మొత్తాన్ని చెక్ను విడుదల చేశారు. నేడు ఆ చెక్ను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్.. కానిస్టేబుల్ శిల్ప అక్క రాణికి అందజేశారు. ఈ సందర్భంగా శిల్ప ట్రీట్మెంట్ కోసం ఆర్థికంగా ఆదుకున్న డీజీపీ మహేందర్ రెడ్డికి, సైబరాబాద్ వీసీ సజ్జనార్కు రాణి ధన్యవాదాలు తెలియజేశారు.