ఫ‌లించిన ఠాక్రే శ‌ప‌థం.. మ‌హారాష్ట్ర పీఠంపై శివసైనికుడు.!

By Medi Samrat  Published on  28 Nov 2019 2:51 PM GMT
ఫ‌లించిన ఠాక్రే శ‌ప‌థం.. మ‌హారాష్ట్ర పీఠంపై శివసైనికుడు.!

మహారాష్ట్ర నూతన సీఎం శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ మైదానంలో ఈ రోజు సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా ఉద్ధవ్‌ చరిత్ర సృష్టించారు. దీంతో.. శివ సైనికుడిని మరాఠా సీఎం పీఠంపై కూర్చోబెడతామంటూ ఠాక్రే చేసిన శపథం ఎట్టకేలకు నెరవేరింది.

ఉద్ధవ్‌తో పాటు మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున మరో ఆరుగురు నేతలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. శివసేన నుంచి ఏక్‌నాథ్‌ ముండే, సుభాష్‌ దేశాయ్‌, ఎన్సీపీ నుంచి చగన్‌ భుజ్జల్‌, జయంత్‌ పాటిల్‌, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌, నితిన్‌​ కేత్‌లు ప్రమాణం చేశారు.

దీంతో నెలరోజుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలుతీరింది. మహారాష్ట్రకు 18వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ సేవలు అందించనున్నారు. ఉద్ధవ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రిల‌య‌న్స్ అధినేత‌ అంబానీ కుటుంబ స‌భ్యులు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్‌తో పాటు సుప్రియా సూలే, రాజ్‌ఠాక్రే, సుశిల్‌ కుమార్‌ షిండే, ఎంకే స్టాలిన్‌లు పాల్గొన్నారు.

Next Story