ట్రాక్‌పై ఆగిన కారు.. ఢీకొన్న గూడ్స్‌ రైలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jun 2020 6:46 AM GMT
ట్రాక్‌పై ఆగిన కారు.. ఢీకొన్న గూడ్స్‌ రైలు

కడప జిల్లా ఎర్రగుట్ల మండలం వై.కోడూరు వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. కారు రైల్వే ట్రాక్‌ దాటుతుండగా సాంకేతిక లోపంతో ట్రాక్‌పై ఆగిపోయింది. కారు ఆగిన క్షణాల్లోనే గూడ్స్‌ రైలు కారును ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

గాయపడిన వ్యక్తిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని వై.కోడూరుకు చెందిన నాగిరెడ్డిగా గుర్తించారు. గూడ్స్‌ రైలు ఇంజిన్‌ భారతీ సిమెంట్‌ పరిశ్రమలో వ్యాగిన్లను వదిలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Next Story