అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులు.

హైదరాబాద్ లోని నాంపల్లి ఎక్సిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు.

By Kalasani Durgapraveen  Published on  11 Oct 2024 4:48 AM GMT
అమ్మవారి విగ్రహాన్ని  ద్వంసం చేసిన దుండగులు.

హైదరాబాద్ లోని నాంపల్లి ఎక్సిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని ఎక్సిబిషన్ సొసైటీ,సిబ్బంది ఆధ్వర్యంలో నెలకొలుపుతారు. గురువారం రాత్రి దండియా ప్రోగ్రాం పూర్తి అయ్యే వరకు ఎక్సిబిషన్ గ్రౌండ్ లొనే పోలీసులు ఉన్నారు. అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారన్న విషయం తెలిసినవెంటనే సంఘటన స్థలానికి అబిడ్స్ ఏసీపీ చెంద్ర శేఖర్ చేరుకొన్ని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొదటగా కరెంట్ కటచేసి,సీసీ కెమెరాలు విరగగొట్టారు. అనంతరం విగ్రహం చేతిని విరగకొట్టి, పూజ సామ్రాగ్రిని.. చుట్టూ పడవేసి, అమ్మవారి చుట్టూ ఉన్న బరికేడ్స్ కూడా తొలగించారు.

ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక వద్ద హిందు ఆరాధ్య విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని భక్తుల ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం పై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని హిందు సంఘాలు డిమాండ్ చేశాయి.

Next Story